Auto driver | కారేపల్లి, మార్చి 29 : సెలవు దినం కావడంతో(ఆదివారం) ఆటలాడుకుంటున్న అమాయక పిల్లల్ని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన సరదా కోసం ప్రమాదానికి గురిచేసిన సంఘటన ఆదివారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం జమాలపల్లి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరుపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యజమాని వజ్జ సునీల్ అనే యువకుడు అతిగా మద్యం సేవించాడు.
గ్రామంలో సరదాగా ఆడుకుంటున్న ఆరుగురు విద్యార్థులను ఆటోలో ఎక్కించుకున్నాడు. పేరుపల్లి నుండి కోటిలింగాల వెళ్లే మార్గంలో విద్యార్థులను ఎక్కించుకొని ఆటో చెక్కర్లు కొడుతూ తీసుకెళ్లాడు. అయితే జమాల్లపల్లి సమీపంలో తను నడుపుతున్న ఆటోను నిబంధనలకు విరుద్ధంగా ఓ విద్యార్థికి ఇచ్చాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు పులసం యశ్వంత్, అలెం స్నేహిత్, ధనసరి భరత్, అలెం తేజ, అలెం చిట్టూ, ధనసరి ప్రవీణులకు గాయాలయ్యాయి.
వెంటనే క్షతగాత్రులను స్థానికులు కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పులసం యశ్వంత్,అలెం స్నేహిత్ లకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Chennur | చెన్నూరులో దారుణం..టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య?
Pakistani ships | ‘హర్మూజ్’ గుండా 20 పాక్ నౌకలకు అనుమతి.. శాంతికి సంకేతమన్న పాకిస్థాన్
Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్