చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం పురుగుల మందు సేవించిన 7వ తరగతి విద్యార్థిని శ్రీహిందూ అనే విద్యార్థిని ఆదివారం మృతి చెందింది.విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందించారు. కాగా, ఆరోగ్యం క్షీణించడంతో నిన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్కు తరలించారు.
నేడు బాలిక మృతి చెందడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పాఠశాల ఉపాధ్యాయునిల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులక ఫిర్యాదు చేశారు. జైపూర్ ఎసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.