KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రైతుల ధాన్యం తక్షణమే కొనాలని, లేనియెడల ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు. కేటీఆర్ వార్నింగ్తో అధికారుల్లో కదలిక వచ్చింది.
ఈ క్రమంలో ఆదివారం సైతం జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి పత్రిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. తాము 236 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కేవలం 48 కేంద్రాల్లోని వడ్లు కొన్నామని వివరించారు. అలాగే తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్ పరిధిలోని ఇందిరానగర్లో ఆదివారం ఆఘమేఘాల మీద కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు కొబ్బరి కాయలు కొడుతున్నారు. వడ్లు కాంట పెట్టి కొంటలేరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.