న్యూఢిల్లీ: వాగన్ఆర్ కారును మెర్సిడీజ్ ఢీకొన్న ఘటనలో 70 ఏళ్ల వృద్ధ మహిళ చనిపోయింది. ఢిల్లీ(Delhi)లోని నరేలా ప్రాంతంలో ఉన్న హిమాలయాస్ అపార్ట్మెట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతురాలిని ఊర్మిళగా గుర్తించారు. మాముర్పుర్ ఆమె స్వంత నివాసం. రెండు వాహనాల మధ్య ఆమె ట్రాప్ అయినట్లు తెలిసింది. ప్రమాద స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. వాగన్ఆర్ నడుపుతున్న డ్రైవర్ ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇక మెర్సిడీజ్ కారు డ్రైవ్ చేస్తున్న శుభమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా పోలీసు శాఖలో అతని తండ్రి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. మెర్సిడీజ్ కారు నుంచి ఓ బీర్ బాటిల్ను రికవరీ చేశారు. మద్యం మత్తులో శుభమ్ కారును డ్రైవ్ చేసినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు దారి తీసిన అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ కేసును నమోదు చేశారు. ఊర్మిళ మృతదేహాన్ని పోస్టు మార్టమ్కు పంపారు.