Harish Rao | భూ భారతి కాదు.. అది భూ హారతి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో భూ భారతి అక్రమాలపై ఆధారాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రాధ అనే వృద్ధురాలికి చెందిన భూమిని భూ భారతి ద్వారా కబ్జా చేశారు. బాధితురాలికి తెలియకుండానే ఆమె భూమిని వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారని మండిపడ్డారు. కేవలం 10 రోజుల్లోనే ఆమె భూమిని ఆమెకు కాకుండా చేశారు. ధరణిని తీసేసి భూ భారతి తీసుకురావడానికి ముఖ్య కారణం ఇదేనని విమర్శించారు.
అలాగే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పసుమాముల గ్రామంలో అనుముల తిరుపతిరెడ్డి భూ కుంభకోణాన్ని బయటపెట్టారు. గతంలో అనుముల తిరుపతిరెడ్డికి వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 5 నెలల్లోనే అనుముల తిరుపతిరెడ్డికి సానుకూలంగా భూమి డాక్యుమెంట్లు మార్చేశారని ఆరోపించారు. ఆ భూమిలో ప్రజలందరూ బిల్డింగ్లు కట్టుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అది వ్యవసాయ భూమి అని అనుముల తిరుపతిరెడ్డి పేరిట డాక్యుమెంట్లు సిద్ధం చేసిందన్నారు.
భూ భారతి కాదు.. భూ హారతి
భూ భారతి అక్రమాలపై ఆధారాలను బయటపెట్టిన హరీష్ రావు
గజ్వేల్ పట్టణంలో రాధ అనే వృద్ధురాలికి చెందిన భూమిని భూ భారతి ద్వారా కబ్జా చేశారు.
బాధితురాలికి తెలియకుండానే ఆమె భూమిని వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
కేవలం 10 రోజుల్లోనే ఆమె భూమిని ఆమెకు కాకుండా… pic.twitter.com/kE9hBSDe9D
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2026