KTR | రాజన్న సిరిసిల్ల , ఏప్రిల్ 19: వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సత్తెమ్మ పార్థీవ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్.. స్వయంగా పాడె మోశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ ‘జై తెలంగాణ’ నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్తోపాటు వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు , మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ , జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.

Pahalgam attack | పహల్గాం దాడికి ఏడాది.. పాక్ తీవ్రవాదంపై అమెరికాలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన భారత్
Bike Rally | హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్లో బైక్ ర్యాలీ
Watch: కలెక్టర్తో రైతుల సమావేశంలో కోతి.. తర్వాత ఏం జరిగిందంటే..?