Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతుల సాగునీటి కష్టాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు ఆలస్యంగా కురిసిన వర్షాలు.. మరోవైపు చాలీ చాలని సాగునీటితో రైతన్న పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయో తెలిపే వీడియో ఇది. రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఓ రైతు నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్నారు.
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతులు నిరసన బాట పట్టారు. రిజర్వాయర్లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ సర్కార్ సాగు నీరు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్న రైతులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ అన్నదాత తమ నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడి నీటిని విడుదల చేయించాలని వేడుకున్నారు.
రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎలా ఉందో చెప్పే ఈ దృశ్యం రైతుల పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యవైఖరి కండ్లకు కట్టినట్టు చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న రైతు
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతుల నిరసన
రిజర్వాయర్లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆగ్రహం
నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడి నీటిని విడుదల… pic.twitter.com/rkP766M3rk
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2026