న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 తగ్గి రూ.46,093కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,223 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన బంగారం ధరలు స్వల్పంగా తగ్గడమే దేశంలో పసిడి ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.305 తగ్గి రూ.66,040కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,345 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,726 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.89 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!