ఖిలావరంగల్, సెప్టెంబర్ 27 : స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్బాపూజీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడమే సరైన నివాళి అని ఎంపీ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. పదవులను పక్కనపెట్టి తెలంగాణ సాధనే ధ్యేయంగా పోరాడిన మహనీయుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. న్యాయవాద వృత్తిలో ఉన్నప్పటికీ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేశాడన్నారు. నిజాం వ్యతిరేక పోరాటం, స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యంమలో కీలక పాత్ర పోషించారన్నారు. బాపూజీ పేరు మీద ప్రతి యేడు ఆగస్టు 7న చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా అవార్డులను ఇస్తున్నారన్నారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. మహానీయుల సిద్ధాంతాలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, బీసీ సంక్షేమశాఖ అధికారి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : మండలంలోని రామవరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కొడారి రవన్న, ఉప సర్పంచ్ జినుకల విమల, వార్డు సభ్యులు పూలమాలలు వేశారు.
చెన్నారావుపేట : గ్రామ పంచాయతీ ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సర్పంచ్ కుండె మల్లయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఖాదర్పేటలో సర్పంచ్ అనుముల కుమారస్వామి, అమీనాబాద్లో సర్పంచ్ సిద్దెన రమేశ్ నివాళులర్పించారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, కార్యదర్శి బాలకిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం : తెలంగాణ ఉద్యమానికి బాటలువేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో సుమనావాణి, ఎంపీటీసీ కవిత, ఎంపీవో కైసర్ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయ్కుమార్ కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీవో కూచన ప్రకాశ్, సూపరింటెండెంట్ రమేశ్బాబు పాల్గొన్నారు.
రాయపర్తి : మండల పరిషత్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంఈవో నోముల రంగయ్య పాల్గొన్నారు.
పర్వతగిరి : మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చింతపట్ల మాలతి, రైతుబంధు సమితి జి ల్లా సభ్యులు చింతపట్ల సోమేశ్వర్రావు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీలు మాడుగుల రాజు, మహేంద్ర, మండలాధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు.
సంగెం : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కందకట్ల కళావతి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విశ్వనారాయణ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో మల్లేశం, రైతుబంధు సమితి మండ ల కన్వీనర్ నరహరి, సర్పంచ్ గుండేటి బాబు పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : శివనగర్లోని పోపా కార్యాలయంలో కొండా లక్ష్మణ్బాపూజీ చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. పోపా నాయకులు గపికొండ సుధాకర్, పాము శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీమాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట యోధుడని డీఎస్పీ రమేశ్, అసిస్టెంట్ కమాండెంట్ వేణుగోపాల్రెడ్డి అన్నా రు. మామునూరులోని 4వ బెటాలియన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్ఐలు కిరణ్కుమా ర్, చంద్రన్న, రవీందర్, రాజ్కుమార్, అశోక్, పురుషోత్తం రెడ్డి, బెటాలియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పోచమ్మమైదాన్ సెంటర్లో అఖిల భారత పద్మశాలి సం ఘం అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో పేలకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కుసుమ సతీశ్, నగర అధ్యక్షుడు గుండేటి నరేంద్రకుమార్, జిల్లా కో ఆర్డినేటర్ వడ్నాల నరేందర్, ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, గోరంటల రాజు పాల్గొన్నారు. వరంగల్ ఎల్బీ నగర్లోని పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోరంటాల రాజు, ఆకెన వెంకటేశ్వర్లు, గాదె ప్రభాకర్ పాల్గొన్నారు.
వరంగల్ : రవాణా శాఖ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి డీటీసీ పురుశోత్తం పూలమాల వేసి నివాళులర్పించారు. ఏవో స్వర్ణలత, ఎంవీఐలు పాల్గొన్నారు.
గీసుగొండ : మండల కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి చైర్మన్ బొచ్చు వినయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్నబాబు, తరుణ్ పాల్గొన్నారు.
నెక్కొండ : మండల రెవెన్యూ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ రాజ్కుమార్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఆర్ఐ సత్యనారాయ ణ, ఏఆర్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. మండలంలోని రెడ్లవాడ సొ సైటీ చైర్మన్ జలగం సంపత్రావు, సర్పంచ్ రావుల శ్రీలత కొం డా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
దుగ్గొండి : మండల పరిషత్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీపీ కాట్ల కోమల, తిమ్మంపేటలో సర్పంచ మోడెం విద్యాసాగర్గౌడ్, గిర్నిబావి ఎంజేపీటీలు దేవేందర్, మందపల్లి పీఎస్ కర్ణకంటి రామ్మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, వైస్ ఎంపీపీ పల్లాటి జేపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుడిపల్లి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
కాశీబుగ్గ : తెలంగాణ బీసీ, బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు గోగికార్ క్రాంతికుమార్ కొండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి దర్మపురి రామారావు పటేల్, సముద్రాల పరమేశ్వర్, కూచన క్రాంతికుమార్ పాల్గొన్నారు.
నర్సంపేట : పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుసుమ భద్రయ్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండలాధ్యక్షుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, యువజన సంఘం అధ్యక్షుడు శ్రీరాముల కోటేశ్వరరావు పాల్గొన్నారు.