చెన్నారావుపేట, మే 9: ఓ రైతు మక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టగా, ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సజీవ దహనమయ్యాడు. ఈ హృద య విదారక ఘటన చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు(65) గురువారం తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. గాలి వీచడంతో మంటలు పక్కనే ఉన్న ఓ రైతు ఆయిల్ పామ్ తోటకు వ్యాపించాయి.
అప్రమత్తమైన పాపారావు మంటలను ఆర్పేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక సజీవ దహనమయ్యాడు. అతడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సంపేట ప్రభుత్వం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై అరుణ్కుమార్ తెలిపారు. కాగా, రైతు భౌతిక కాయానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నివాళులర్పించి, ఆయన కుటుంబు సభ్యు లను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.