TSRTC | హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్ నగరం నుంచి వివిధ జిల్లాలకు, పట్టణాలకు 2 వేల ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇన నేడు, రేపు, ఎల్లుండి నడిచే 450 బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సులను నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది.