– ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.హరీష్ కుమార్, ఎన్సీసీ సుబేదార్ మేజర్ మాదవరావు
రామగిరి, ఆగస్టు 03 : వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై విధిగా మొక్కలు నాటి సంరక్షణ చేయాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.హరీష్ కుమార్, ఎన్సీసీ 31 బెటాలియన్ సుబేదార్ మేజర్ మాదవరావు అన్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ విభాగం ఎన్సీసీ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. అంతకుముందు యూనివర్సిటీలో విద్యార్థులు పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ సైతం దేశభక్తిలో అంతర్భాగమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ ఎన్సీసీ అధికారి డా.మచ్చేందర్, అధ్యాపకులు డా.విజయ్కుమార్, ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు పాల్గొన్నారు.