Chiranjeevi | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నారని తెలిసిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్ తరపున పలువురు సినీ ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటూ.. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి పవన్ కల్యాణ్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సోదరుడు పవన్ కల్యాణ్కు మద్దతునిస్తూ ఓ వీడియోను కూడా అందరితో పంచుకున్నాడు.
అయితే తాను రేపు (శనివారం) పవన్ కల్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు పిఠాపురం (Pithapuram) వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై చిరంజీవి స్పందించాడు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. తాను పిఠాపురం వెళ్లడం లేదని స్పష్టం చేశాడు. ప్రచారానికి రావాలని కూడా తన తమ్ముడు ఎప్పుడు కోరలేదన్నాడు. తాను ప్రస్తుతం రాజకీయాలకతీతంగా ఉన్నానన్నాడు. తన తమ్ముడికి అండగా ఉన్నానని చెప్పేందుకే ఇటీవలే ఓ వీడియో విడుదల చేసినట్టు చెప్పాడు. దివంగత నటుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు భారతరత్నక అర్హుడని అన్నాడు మెగాస్టార్ చిరంజీవి.
గత ఏపీ ఎన్నికల్లో రెండో చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈ సారి పిఠాపరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారని తెలిసిందే. పిఠాపురంలో ఎలాగైనా పవన్ కల్యాణ్ను గెలిపించాలని మెగా ఫ్యామిలీ యాక్టర్లు ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కోరుతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్కు న్యాచురల్ స్టార్ నాని (Nani) మద్దతు తెలియజేస్తూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ కూడా చేశాడు.