భద్రాచలం: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నది. దీంతో భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దర్శనాలను కూడా నిలిపేశారు. ఇప్పటికే 12వ తేదీ నుంచి పది రోజలు పాటు లాక్డౌన్ విధించినట్టు ప్రభుత్వం ప్రకటించగా.. ఆమేరకు రామయ్య దర్శనాలను కూడా నిలిపేస్తున్నట్టు ఈవో బీ.శివాజీ ప్రకటించారు. ఆ తర్వాత లాక్డౌన్ను 30వతేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించడంతో భద్రాద్రిలో కూడా స్వామివారి దర్శనాలను ఈనెల 30 వరకు నిలిపివేస్తున్నట్టు ఈవో తెలిపారు. స్వామివారి నిత్యకైంకర్యాలు మాత్రం యథావిధిగా ఆంతరంగికంగా జరుగుతాయన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి