అబుజా: ఆఫ్రికన్ దేశమైన నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నైజీరియన్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇబ్రహిం అట్టాహిరు మరణించారు. గత కొంతకాలంగా కడునా రాష్ట్రంలో హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం సాయంత్రం అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న నైజీరియా ఎయిర్ ఫోర్స్ విమానం కడునా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో అట్టహిరుతోపాటు మరో ఆర్మీ అధికారి మరణించారని నైజీరియా వాయుసేన వెల్లడించింది. విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. మిలటరీ సమగ్ర మార్పులో భాగంగా ఇబ్రహీం జనవరి నెలలో ఆర్మీ చీఫ్ గా పదవిని చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి