Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఐదురోజులుగా లాభాలకు బ్రేక్పడినట్లయ్యింది. గత సెషన్తో పోలిస్తే సూచీలు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు పతనమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ మళ్లీ కోలుకోలేదు. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 74,509.31 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది. ఒక దశలో 74,515.91 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అత్యల్పంగా 73,616.65 పాయింట్లకు చేరింది. చివరకు 609.28 పాయింట్ల నష్టంతో 73,730.16 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 150.30 పాయింట్లు పతనమై.. వద్ద స్థిరపడింది. దాదాపు 1,710 షేర్లు పురోగమించగా.. 1,521 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం టాప్ లూజర్గా నిలిచాయి. టెక్ మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, ఎల్టీఐమైండ్ట్రీ, బజాజ్ ఆటో, బీపీసీఎల్ లాభపడ్డాయి. సెక్టార్లలో ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్కేర్, రియాల్టీ, మీడియా షేర్లు 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి.