Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటింగ్ ప్రారంభమైన 8 గంటల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకూ 50 శాతం మేర నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. త్రిపుర రాష్ట్రంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అక్కడ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ 68.92 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో అత్యల్పంగా 43.01 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 15.88 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరికోసం 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
Voter turnout till 3 pm for phase 2 of #LokasabhaElection2024
Assam 60.32%
Bihar 44.24%
Chhattisgarh 63.32%
Jammu And Kashmir 57.76%
Karnataka 50.93%
Kerala 51.64%
Madhya Pradesh 46.50%
Maharashtra 43.01%
Manipur 68.48%
Rajasthan 50.27%
Tripura 68.92%… pic.twitter.com/7hZEJ4AlJ3— ANI (@ANI) April 26, 2024
Also Read..
Lok Sabha Pols | ఆసుపత్రి నుంచి వచ్చి ఓటేసిన నారాయణమూర్తి
Google Doodle | రెండో విడత పోలింగ్.. గూగుల్ ప్రత్యేక డూడుల్ చూశారా..?
Kavya Maran | హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం.. కావ్య మారన్ రియాక్షన్ వైరల్