హైదరాబాద్ : సికింద్రాబాద్లోని( Secunderabad) ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ను(Urvashi Bar and Restaurant) పోలీసులు మూసివేశారు. ఊర్వశి బార్లో అశ్లీ నృత్యాలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 30 మంది అమ్మాయిలతో పాటు 60 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యాజమాన్యం బార్లో అమ్మాయిలతో నృత్యాలను చేయిస్తున్నారు. దీంతో యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు బార్ లైసెన్స్ను రద్దు(License canceled) చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.