న్యూఢిల్లీ, ఆగస్టు 14: రిలయన్స్ ఇండస్ట్రీస్..బ్రిటన్కు చెందిన ప్రముఖ ఏరో ఇంజిన్ తయారీ దిగ్గజం రోల్స్-రాయిస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజక్టైన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(ఏఎంసీఏ) కోసం స్వదేశీయ యుద్ధ విమాన ఇంజిన్ను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నాయి.
భారత్లో ప్రత్యేకంగా ఒక ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ కేంద్రం ద్వారా యుద్ధ విమాన ఇంజిన్ల డిజైన్, అభివృద్ధి, తయారీ, టెస్టింగ్, ఉత్పత్తి నిర్వహణ వంటి అన్ని కార్యకలాపాలను దేశీయంగా చేపట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ..కీలకమైన సాంకేతికతల్లో స్వయం సమృద్ధి సాధించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రోల్స్-రాయిస్..రిలయన్స్ సామర్థ్యాలను కలిపి ప్రపంచస్థాయి ఏరో ఇంజిన్ వ్యవస్థ నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు.