న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లోని ఛాంగ్లాంగ్ ప్రాంతంలో శుక్రవారం భూప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 7 గంటల 18 నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్సీఎస్) వెల్లడించింది. ఛాంగ్లాంగ్కు దక్షిణంగా 402 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్లు ఎన్సీఎస్ స్పష్టం చేసింది.
భూప్రకంపనల కారణంగా జనాలు తీవ్ర భయాందోళనలకులోనై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించ లేదని అధికారులు గుర్తించారు. హిమాలయ పరివాహాక రాష్ట్రాల్లో తరుచూ భూప్రకంనలు పరిపాటేనని జియాలజిస్టులు పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.