ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఖజానా ఖాళీ అవడంతో డబ్బు పొందడం కోసం వివిధ మార్గాలను ఎంచుకుంటున్నది. ఇప్పటికే రెండు, మూడు దేశాల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న పాకిస్తాన్.. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అప్పులు తీసుకున్న దేశాలకు తిరిగి చెల్లించలేక పాకిస్తాన్ ప్రభుత్వం సతమతమవుతున్నది. డబ్బులు రాబట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రభుత్వం కొత్త పథకానికి తెరలేపేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నది. త్వరలో క్యాబినెట్ సమావేశంలో దీనికి గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నారు.
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్, ఇస్లామాబాద్లోని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అధికారిక నివాసాన్ని సాధారణ ప్రజలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రజలు సాంస్కృతిక, ఫ్యాషన్, విద్యా కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాల కోసం ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు తీసుకోవచ్చు. త్వరలో జరుగనున్న ఇమ్రాన్ క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించినిర్ణయం తీసుకోనున్నట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. ప్రధానమంత్రి నివాసం, రెండు అతిథిగృహాలతోపాటు లాన్ ఆడిటోరియంను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సేకరించనున్నారు. దౌత్య కార్యక్రమాలు, అంతర్జాతీయ సెమినార్లు కూడా ఈ క్యాంపస్లో నిర్వహిస్తారు. వీటికి అద్దె వసూలు చేయడం ద్వారా ఎంతో కొంత ఖజానాకు డబ్బు వస్తుందని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భావిస్తున్నది.
ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేండ్లలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 19 బిలియన్ డాలర్లు పడిపోయింది. ఇమ్రాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు అనేక కఠిన చర్యలు తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాలన ఆర్థిక వ్యవస్థతో ఆడుతున్నదని మాజీ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం మీద అప్పు 45 వేల బిలియన్ రూపాయలు పెరిగింది. ప్రభుత్వ నివాసాన్ని యూనివర్శిటీగా మారుస్తానని 2019 లో ఇమ్రాన్ఖాన్ ప్రకటించారు. అయితే, అధికారిక భవనాన్ని ఖాళీ చేయకుండా యూనివర్శిటీ ఏర్పాటు ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడిచిందని విపక్షాలు మండిపడుతున్నాయి.
రూ.6,504 కోట్ల లాభాన్ని ఆర్జించిన ఎస్బీఐ
అనాథల సంక్షేమ చట్టాల అమలు చూడండి: వెంకయ్యనాయుడు
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఉచితం
బిల్లుకు మద్దతు తెలిపి ఇప్పుడు ఆందోళనలా?
రక్షణ మంత్రి టార్గెట్గా కార్ బాంబు దాడి
ఆసియా తొలి న్యూక్లియార్ రియాక్టర్ ప్రారంభం
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..