నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవలయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విత్తనాల పంపిణీ నుంచి పండించిన పంట మార్కెటింగ్ వరకు అనుభూతులు, అనుభవాలు పరస్పరం పంచుకునెందుకు రైతాంగానికి ఒక వేదిక అని ఆయన తెలిపారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండలం మామిడాల గ్రామం నుంచి మోత్కుర్ వరకు 9 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణపు పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
అంతకు ముందు ఆయన అదే మండల పరిధిలోని ఖాజీరామరం, అనిశెట్టి దుప్పలపల్లి, తిప్పర్తి, మామిడాల, పజ్జుర్ గ్రామాలలో నిర్మించిన రైతువేదికలతో పాటు
తిప్పర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఏమి ఇచ్చారు అని ప్రశ్నిస్తున్న వారికి రైతుబంధు సరైన సమాధానం అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పంట దిగుబడి అయిందో ప్రస్తుతం ఒక్క తెలంగాణా రాష్ట్రంలో అంతటి పంట దిగుబడి అయి ధాన్యం దిగుబడిలో యావత్ భారతదేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నామన్నారు.
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఎక్కువ లబ్ధి పొందింది కుడా ఉమ్మడి నల్లగొండ జిల్లాయోనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి ,టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ రామచంద్ర నాయక్ నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ నాగులాంచ విజయలక్ష్మి, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పాశం సంపత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్