పెద్దపెల్లి : అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని మంథని పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పట్ల గ్రామంలో కాశెట్టి రవి అనే వ్యక్తి పత్తి విత్తనాల ప్యాకెట్లని ఎలాంటి బిల్లులు లేకుండా బ్లాక్ లో అధిక ధరలకు అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి రవి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో రెండు కంపెనీలకు సంబంధించిన 48 పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.