శక్కర్నగర్, ఏప్రిల్ 17: బోధన్ పట్టణంలోని వడ్డీ వ్యాపారస్తులు, జీరో ఫైనాన్స్లపై సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది వడ్డీ వ్యాపారులను గుర్తించామని పట్టణ సీఐ ఎస్.వీరయ్య తెలిపారు.
వడ్డీ వ్యాపారంతో ప్రజలను ఇబ్బంది పెట్టేవారిపై చట్టపరంగా చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే త్వరలో కౌన్సెలింగ్ కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారస్తులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.