హైదరాబాద్ : ఓరుగల్లు నగరం మరో కొత్త శోభను సంతరించుకోనుంది. మడికొండ ఐటీ పార్కు వద్ద హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు ఇచ్చింది. హైటెక్స్తో పాటు త్రీస్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. హైటెక్స్ ఏర్పాటుకు అనుమతులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు.