జగిత్యాల, ఏప్రిల్ 17: జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న అంతర్గాం గ్రామస్తులు అధైర్యపడొద్దని అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం గ్రామంలో రోడ్డు విస్తరణలో పోతున్న భూములను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అంతర్గాం గ్రామం నుంచే జాతీయ రహదారి 563 వెళ్తున్నదని, ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే కూడా చేసిందని, గ్రామంలో 45 పైన ఇండ్లు, 100 మంది పైన రైతులు భూమి కోల్పోయే అవకాశం ఉందన్నారు.
గ్రామస్తులు బాధపడొద్దని, అధికారులతో మాట్లాడి, న్యాయం చేస్తామని చెప్పారు. కాగా, గ్రామం పక నుంచే నేషనల్ హైవే వెళ్తున్నందున ఇక్కడ ఫె్లైఓవర్, అండర్ పాస్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే మళ్లీ రీ సర్వే రైతులు, ప్రజలకు తకువ నష్టం జరిగేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.