హైదరాబాద్ : అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను గురువారం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..అర్హులైన పేదలకు కార్డులు జారీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు.
రేషన్కార్డులు రానివారు తిరిగి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించిన కొత్త కార్డులు అందిస్తారన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..పేదలకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ సర్కిల్ 7 ఏఎస్వో ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?