ఖమ్మం/మామిళ్లగూడెం, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి.కోల్టే, చరణ్జిత్ సింగ్ అధికారులకు సూచించారు. పొన్నెకల్లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు పనులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి శుక్రవారం వారు సందర్శించారు. కౌంటింగ్ గదులు, పారింగ్తోపాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెకింపు టేబుళ్ల కూర్పు, అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్ల ప్రవేశం, ఈవీఎంల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. సీసీ కెమెరాలు, లైటింగ్, బారికేడ్లు, మీడియా సెంటర్ వద్ద అన్ని వసతులు కల్పించాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ లెకింపునకు చేపట్టిన చర్యలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల భద్రతకు ఏర్పాటు చేసిన ర్యాక్లను పరిశీలించి.. ఆయా సెగ్మెంట్ల ఈవీఎంలు పట్టేంత సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. అక్కడి ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ పరిశీలకులకు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, శిక్షణ ఐపీఎస్ పి.మౌనిక, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్యామ్ప్రసాద్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీలత పాల్గొన్నారు.