పట్నా : బిహార్లో స్కూళ్లు, షాపులు, సినిమా థియేటర్లు ఈనెల 7 నుంచి పునఃప్రారంభమవుతాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం ప్రకటించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి క్లాసులకు ఆగస్ట్ 15 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయని చెప్పారు. తొమ్మిది, పదోతరగతి విద్యార్ధులకు ఆగస్ట్ 7 నుంచి రోజు విడిచి రోజు యాభై శాతం హాజరుతో క్లాసులు మొదలవుతాయని వెల్లడించారు. కోచింగ్ సెంటర్లు సైతం యాభై శాతం సామర్ధ్యంతో రోజు విడిచి రోజు తెరుచుకుంటాయని చెప్పారు. దుకాణాలు 7 నుంచి తెరుచుకుంటాయని, షాపింగ్ మాల్స్ రోజు విడిచి రోజు ఓపెన్ అవుతాయని తెలిపారు.
ఇక సినిమా హాళ్లు యాభై శాతం సీటింగ్ సామర్ధ్యంతో రాత్రి ఏడు గంటల వరకూ తెరుస్తారని అదనపు ముఖ్య కార్యదర్శి చైతన్య ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షాపులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ తమ సిబ్బందికి పూర్తిస్ధాయిలో వ్యాక్సినేషన్ చేపట్టాలని స్పష్టం చేశారు. తమ సిబ్బంది వివరాలను ఆయా సంస్ధలు స్ధానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని కోరారు. కాగా దేవాలయాలు, ప్రార్ధనాలయాలకు బిహార్ ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు.