న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు గరిష్ఠానికి చేరాయి. దీంతో వివిధ రాష్ట్రాలు ఎక్కడికక్కడ లాక్డౌన్లతోపాటు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టీ2 టెర్మినల్ను అధికారులు మూసివేశారు. ఈనెల 17 నుంచి టీ3 టెర్మినల్ నుంచి మాత్రమే విమానాల రాకపోకలు సాగుతాయని ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో సాధారణంగా రోజుకు 325 విమానాలు రాకపోకలు సాగిస్తుండేవి. కరోనా మహమ్మారికి ముందు రోజూ 1500 విమానాలు వస్తుండేవని చెప్పారు. అయితే గత కొన్ని వారాలుగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2.2 లక్షల నుంచి 70వేలకు తగ్గిందని పౌర విమానయాన మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో విమానాశ్రయంలోని టీ 2 టెర్మినల్ను తాత్కాలికంగా మూసివేశామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి