సంగారెడ్డి, ఏప్రిల్ 2: భక్తుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై వెలిసిన సప్తప్రాకారయుత శ్రీ దర్గా భవానీ ఆలయం 20వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు.సంగారెడ్డి మండల పరిధిలోని ఇస్మాయిల్ఖాన్పేటలో అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఆలయ ప్రాంగణం భక్తుల తో కిటకిటలాడింది. గ్రామంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పండుగ వాతావరణం నెలకొన్నది. అమ్మవారికి ప్రత్యేకమైన పంచామృతం, పండ్లరసాలు, నది జలాలు, తీర్థాలతో అభిషేకం నిర్వహించారు.ఈ బ్రహ్మోత్సవాలను ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమంలపేట రాధాకృష్ణ మూర్తి శర్మ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే బ్రహ్మత్సవాలు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ నిర్వహణలో అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ము ఖ్యంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలను రుత్విక్ అందజేశారు. అమ్మవారికి కుర్మ మల్లేశ్ యాదవ్ అన్నదాన చేశారు. వేడుకల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
తైవాన్లో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి
యూరప్ను వణికిస్తున్న థర్డ్వేవ్