వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రసంగంలో హోలీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈస్టర్ వేడుకలను పురస్కరించుకుని అధ్యక్ష భవనం నుంచి జాతినుద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో మనదేశపు పండుగ అయిన హోలీని గురించి ప్రస్తావించడం విశేషం. ప్రజలు వారం క్రితమే హోలీ పండుగ చేసుకున్నారని, ఇప్పుడు ఈస్టర్ సంబురాలు జరుపుకుంటున్నారని, మరికొన్ని రోజుల్లో రంజాన్ కూడా వస్తుందని బైడెన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
తాను, తన భార్య జిల్ బైడెన్ ఈస్టర్ వేడుకల కోసం ఎదురుచూస్తున్నామని బైడెన్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవచ్చన్నారు. అయితే, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను మాత్రం ఉల్లంఘించవద్దని ఆయన సూచించారు.
జనం కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశం ఉందని, వైద్య నిపుణులు కూడా ఈ విషయమై వార్నింగ్ ఇచ్చారని బైడెన్ గుర్తుచేశారు. కాబట్టి అందరూ కొవిడ్-19 నిబంధనలు పాటించాలని కోరారు. అదేవిధంగా కొవిడ్ టీకా చాలా సురక్షితమైనదని, కనుక అందరూ ఎలాంటి సంకోచం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్ !