న్యూఢిల్లీ: 13 రాష్ట్రాల్లోని 88 సీట్లకు ఇవాళ లోక్సభ రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ రెండో విడుతలో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి(Richest Candidate)గా వెంకరమణ గౌడ్ బరిలో ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన్ను స్టార్ చంద్రూ అని పిలుస్తుంటారు. ఏడీఆర్ ప్రకారం ఫేస్ 2 పోలింగ్లో రిచ్చెస్ట్ క్యాండిడేట్ ఈయనే. హెచ్డీ కుమారస్వామిపై ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తులు 622 కోట్లుగా ప్రకటించారు.
కర్నాటక కాంగ్రెస్కు చెందిన ఎంపీ డీకే సురేశ్.. రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 593 కోట్లు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడే సురేశ్. బెంగుళూరు రూరల్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. పోలింగ్ ఆఫీసర్లకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు బ్యాంకు డిపాజిట్లు 16.61 కోట్లు ఉన్నాయి. 32 కోట్లు విలువ చేసే వ్యవసాయ భూమిలు ఉన్నాయి. 210 కోట్లు విలువ చేసే వ్యవసాయేతర భూములు ఉన్నాయి. 27 కోట్లు విలువ చేసే రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి.
మథుర లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి హేమామాలిని.. రెండో దఫా ఎన్నికల్లో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. ఆమె ఆస్తులు 278 కోట్లు. సంపన్నుల జాబితాలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ నాలుగవ స్థానంలో ఉన్నారు. ఆయనకు 232 కోట్ల ఆస్థి ఉన్నది. కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి.. 217 కోట్లతో లిస్టులో అయిదవ స్థానంలో ఉన్నారు.
ఆస్తులే లేనివాళ్లలో..
రెండో ఫేస్లో పోటీపడుతున్న వారిలో నాందేడ్ స్వతంత్య్ర అభ్యర్థి లక్ష్మణ్ నగోరా పాటిల్ అతి తక్కువ ఆస్తులు ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఆయన తన అఫిడవిట్లో కేవలం రూ.500 ఉన్నట్లు మాత్రమే చూపారు. ఇక ఈ లోయస్ట్ అసెట్స్ జాబితాలో.. రెండో స్థానంలో కాసర్గడ్ నుంచి పోటీ చేస్తున్న రాజేశ్వరి ఉన్నారు. ఆమె వద్ద కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి. అమరావతి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పృథ్వీసమ్రాట్ ముకింద్రా దీప్వాన్ష్ మూడవ స్థానంలో ఉన్నారు. ఆ అభ్యర్థి వద్ద కేవలం రూ.1400 ఉన్నాయి. జోథ్పూర్ నుంచి పోటీ చేస్తున్న దళిత క్రాంతి దళ్ నేత షహనాజ్ బానో వద్ద కేవలం రూ.2000 మాత్రమే ఉన్నాయి.
జీరో అసెట్స్ ఉన్న వారిలో కర్నాటకకు చెందిన ప్రకాశ్ జైన్, రామమూర్తి ఎం, రాజా రెడ్డి ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన కిషోర్ బీమ్రావ్ లబాడే, నగేశ్ సాంబాజీ గైక్వాడ్, ధ్యానేశ్వర్ రావుసాహెబ్ కపాటేలు కూడా జీరో అసెట్స్ జాబితాలో ఉన్నారు.