బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే జేపీ నడ్డా ఆధ్వర్యంలో హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు విధించాయని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనా నిబంధలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని.. వాటిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని పేర్కొన్నారు. జేపీ నడ్డా ర్యాలీ జరిగే నార్త్ జోన్ పరిధిలో జనాలు గుమిగూడే ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయని.. కరోనా వ్యాప్తి ప్రబలే అవకాశం ఉండటంతో ర్యాలీకి అనుమతి నిరాకరించామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తెలంగాణలో జేపీ నడ్డాకు ర్యాలీకి అనుమతి లేదు : పోలీసులు
రాష్ట్రంలో బీజేపీ అరాచకం సృష్టిస్తోంది : ఎమ్మెల్సీ గుత్తా
బదిలీలు, కేటాయింపులకు స్థానికత వర్తించదు.. ఒక్క నియామకాల వరకే పరిమితం
బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు
DCP Chandana Deepti | నార్త్జోన్ డీసీపీగా చందన దీప్తి