సికింద్రాబాద్, డిసెంబర్ 25: నార్త్జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా చందన దీప్తి నియమితులయ్యారు. మెదక్ ఎస్పీగా పనిచేస్తున్న ఆమె బదిలీపై ఇక్కడికి వస్తున్నారు.మెదక్ ఎస్పీగా పనిచేస్తూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్పై ప్రత్యేక శ్రద్ధ వహించి.. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారు. 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి అయిన చందన దీప్తి మొదటగా నల్లగొండలో ప్రొ బెషనరీ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. అనంతరం తాండూరు ఏఎస్పీగా, నిజామాబాద్ ఓఎస్డీగా పనిచేశారు. 2013 నుంచి మెదక్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో భాగంగా నార్త్జోన్ డీసీపీగా నియామకమయ్యారు.