హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి తెలంగాణలో అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ నిబంధనల వల్ల ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. కొవిడ్ ఆంక్షలు ఈ నెల 10వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. జేపీ నడ్డా మూడు రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఘట్కేసర్ సమీపంలోని అన్నోజిగూడలో నిర్వహించే ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో నడ్డా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు.