దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 15: భారతరత్న అవార్డుగ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలు మరువలేనివని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 161వ జయంతిని పురస్కరించుకుని మండలంలోని చౌదర్పల్లి సమీపంలోని స్విట్స్ కళాశాలలో బుధవారం ఇంజినీర్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం కళాశాలలోని మోక్షగుండం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జయంత్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు కన్నయ్యశెట్టి, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, వైస్ప్రిన్సిపాల్ తేజోవర్ధన్, యాజమాన్య కమిటీ సభ్యులు, ఆయా విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆలకు శుభాకాంక్షలు
భూత్పూర్, సెప్టెంబర్15: మున్సిపాలిటీలోని 3వ వార్డులో చేపపిల్లలను విడుదల చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మురళీధర్గౌడ్ గులాబీ పుష్పగచ్ఛం ఇచ్చి ఇంజినీరింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా ఇంజినీర్స్ డే
మహబూబ్నగర్టౌన్,సెప్టెంబర్ 15: మున్సిపల్ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో కేట్కట్ చేసి, విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, మహ్మద్అన్వర్, నజీబ్, శావ్రణ్కుమార్, ఉపాధ్యక్షుడు పీర్సాధిక్, శివకుమార్, గోవర్దన్, నాగరాజు పాల్గొన్నారు.