గద్వాల: గద్వాల అభివృద్ధిలో విద్యుత్ ఉద్యోగులు భాగస్వాములై రైతులకు నాణ్యమైనా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ డీఈ కార్యాలయంలో నూతనంగా రూ.2కోట్లతో నిర్మించే ఎస్ఈ కార్యాలయ భవానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్ర హాంతో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా విద్యుత్శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించి మాట్లా డారు. విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులకు మంచి సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. త్వర లో రైతులు, ప్రజలకు అవసరమైనా విద్యుత్ పరికరాలు అందించే సబ్స్టోర్ను త్వరలో అందుబాటులోకి తెస్తామని ఎమ్మె ల్యే తెలిపారు.
జిల్లాలో మొత్తం రైతులకు సంబంధించి వ్యవసాయ కనెక్షన్లు 13వేల దాక పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వ్యవ సాయదారులకు విద్యుత్ కనెక్షన్లు వెంటనే ఇవ్వాలని విద్యుత్ అధికారులకు ఆదేశించారు.గద్వాలలో చాలావరకు పాత లైన్లు ఉన్నాయని దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని పునరుద్దరించాలని సూచించారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం ఎక్కువైందని చెప్పారు. గతంలో రాజకీయ నాయకులను కలిస్తేనే విద్యుత్ కనెక్షన్ వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వరుస క్రమంలో ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. రైతులతో పాటు వినియోగదారులకు మీ సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ అవసరమని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు ప్రజల నుంచి ఎదుర్కోంటున్నఇబ్బందులు తొలగించడానికి కృషి చేస్తానని తెలిపారు.
పనులు వేగవంతంగా చేయాలి: జడ్పీచైర్పర్సన్
ప్రస్తుతం భూమి పూజ చేసుకుంటున్న ఎస్ఈ కార్యాలయ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని జడ్పీ చైర్పర్సన్ సరిత కోరారు. నడిగడ్డలో రైతులు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారికి నాణ్యమైనా విద్యుత్ అందించడం అధికారుల బాధ్యత అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో రైతులకు సంబంధించి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు.
రైతులు కరెంట్ కోసం ఎదురు చూసే వారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని రైతులు ఎప్పుడైనా వెళ్లి తమ పంట పొలాలకు నీరు పెట్టుకుని ప్రశాంతగా నిదుర పోతున్నారన్నారు.గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని సరిదిద్దాలని ఎస్ఈని కోరారు. విద్యుత్ శాఖలో ఎవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకవస్తే వాటిని ఉన్నతాధికారులు,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.
జిల్లాలో విద్యుత్ వెలుగులు విరజిల్లేలా అధికారులు కృషి చేయాలి: ఎమ్మెల్యే అబ్రహాం
జి ల్లాలో విద్యుత్ వెలుగులు విరజిల్లేలా ఆ ఆశాఖ అధికారులు కృషి చేయాలని అంలపూర్ ఎమ్మెల్యే అబ్రహాం సూచించారు. ప్రస్తుతం భూమి పూజ చేసిన కార్యాలయ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. విద్యుత్ ప్రస్తుతం మనిషి జీవితంలో నిత్యావ సర వస్తువుగా మారిందని తెలిపారు. దేశంలో 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంబాలు సరిగా లేవని వాటిని సరి చేయాలని ఎస్ఈ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో విద్యుత్శాఖ ఎస్ఈ భాస్కర్, డీఈ మోహ న్, మున్సిపల్ చైర్మన్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ జిల్లా రైతు బంధు అధ్యక్షుడు చెన్నయ్య కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.