గద్వాల: మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం మిలాద్ఉన్ నబీ జయంతి సందర్భంగా మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మిలాద్ ఉన్నబీ జయంతిని పురష్కరిం చుకుని జిల్లా కేంద్రంలోని నల్లకుంటలో ఉన్న షాదీఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మహ్మాద్ ప్రవక్త పుట్టిన రోజున మిలాద్ ఉన్ నబి పండుగ జరుపుకుంటారని తెలిపారు.
ఈ సందర్భంగా మహామ్మద్ ప్రవక్త భోధనలకు అనుగుణంగా శాంతి, మత సామరస్యంతో, పరమత సహనం, శాంతియు త సహజీవనమే ప్రవక్తకు మనం అందించే నివాళులని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాడని చెప్పారు.
మైనార్టీ విద్యార్థు లకు కార్పోరేట్ స్థాయిలో విద్యను అందించడానికి వారి కోసం మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశార న్నారు. అందులో వారికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు భోజనం పుస్తకాలు అందిస్తున్నారన్నారు. షాదీ ముబారక్ పథకం ప్రవేశ పెట్టి పేద ముస్లిం అమ్మాయిల పెళ్లిల్లకు చేయూత ఇచ్చారని చెప్పారు.
మహ్మాద్ ప్రవక్త బోధనలను అనుకరిస్తూ మనషుల జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని గ్రంథంలో పొందుపర్చారన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలన్నారు. మైనార్టీ సోదరులు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీ విజయ్కుమార్, జడ్పీటీసీ రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంజీవులు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గోవిందు, మైనార్టీ నాయకులు రహమాన్, మున్నా భాష పాల్గొన్నారు.