మనం ఆరోగ్యంగా ఉంటేనే ధనవంతులం అనే నానుడి ఊరికే రాలేదు. ఎంత ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే మాత్రం ఏమీ లేనట్టే అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే వ్యాపారమైనా.. ఉద్యోగమైనా చేయగలం. అదే అనారోగ్యం పాలైతే.. జేబు చమురు విదిలించుకోవాల్సిందేగా..! అందునే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తున్నారు వైద్యనిపుణులు.
ఆరోగ్యంగా ఉన్నవారు 28 శాతం ఎక్కువ సంపదను సంపాదిస్తారు. భారతీయ వ్యాధుల కోసం ఖర్చు చేయడం వల్ల దారిద్య్రరేఖకు దిగువనున్న 5.5 కోట్లు అనారోగ్య ప్రజలు తక్కువ ఆదాయాన్ని సంపాదిస్తారు. వారి పొదుపులు కూడా తక్కువగానే ఉంటాయి. అందువల్ల వారు ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే వారి జీవితకాలంలో తక్కువ సంపదను పొందగలుగుతారు. ఇది ఒక అమెరికన్ పరిశోధనలో తేలింది. 16 నుంచి 20 సంవత్సరాల జీవితాన్ని పేలవమైన ఆరోగ్యంతో గడిపే వ్యక్తులు ఆదాయాన్ని తగ్గించడం, వ్యాధుల కోసం ఖర్చు చేయడం వల్ల మిలియన్ల రూపాయలు కోల్పోతున్నట్లు పేర్కొన్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, భారతదేశంలో ఆరోగ్య సేవలకు ఖర్చు చేసిన మొత్తంలో 67.78 శాతం ప్రజల జేబులో నుంచి బయటకు వస్తున్నది. ఈ సందర్భంలో ప్రపంచ సగటు కేవలం 18.2 శాతంగా ఉన్నది. వ్యాధుల నివారణ కోసం ఖర్చు చేయడం ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తుంది.
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, 2017-18లో వ్యాధులు,ఔషధాల కోసం ఖర్చు చేయడం వల్ల 5.5 కోట్ల మంది భారతీయులు దారిద్య్రరేఖకు దిగువకు వెళ్లారు.
భారతదేశంలోని కుటుంబాల ఆరోగ్య ఖర్చులు సంపాదించే డబ్బుపై సంవత్సరానికి 16.4 శాతం చొప్పున పెరుగుతున్నది. కెరీర్ రేటింగ్ సర్వే ప్రకారం.. ఇక్కడి గ్రామాల్లో దవాఖానలో చేరేందుకు సగటున రూ.16,676 ఖర్చు అవుతున్నది. నగరాల్లో రూ.27,000 గా ఉన్నది.
అల్పదాయ వర్గాల వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆర్థికంగా కూడా కుండిపోతున్నారు. దానికి ప్రధాన కారణంగా మెడికల్ ఇన్సురెన్స్ గురించి అవగాహన లేకపోవడమే.
14 శాతం గ్రామీణ, 19 శాతం పట్టణ ప్రజలు మాత్రమే ఆరోగ్య బీమా కలిగి ఉన్నారు. వీరి
జీవనశైలిని మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశంలో ప్రతి సంవత్సరం 63 శాతం మరణాలు చెడు జీవనశైలి వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయి. పోషకాహారం సమస్యల కారణంగా చిన్నారుల్లో మరణాలు పెరుగుతున్నాయి.
కాలుష్య నివారణకు ప్రభుత్వాలు కూడా మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడో వచ్చే వ్యాధుల గురించి ఇప్పుడు ఇన్సురెన్స్ తీసుకోవడం ఎందుకనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా.. ముందుగానే చర్యలు తీసుకోవడం వల్ల అన్ని రకాలుగా మనకు మేలు చేకూరుస్తుందని గుర్తుంచుకోవాలి.
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు
హజ్ యాత్రికులకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి : సౌదీ ప్రభుత్వం
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్కు 72 లక్షల జరిమానా
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..