కందుకూరు : టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించే పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవారం మండల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి దశరథ ముదిరాజ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పున్న భిక్షపతి, ఆనేగౌని అంజయ్య గౌడ్లు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 25న నిర్వహించే ప్లీనరీతో పాటు నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభను జయప్రదం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ విజయగర్జనకు తరలిరావాలని చెప్పారు. ప్లీనరీ అనంతరం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు.
పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని వివరించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు జిట్టె రాజేందర్రెడ్డి. డాక్టరు జంగయ్య, గొరెంకల యాదయ్య, రాములు,పాల్లొన్నారు.
సమన్వయ సమావేశానికి వెల్లిన నాయకులు ..
ప్లీనరీ, విజయగర్జన సభలను విజయవంతం చేయడానికి బుధవారం మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మార్కెట్ కమిటి చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ మదిరాజ్లు వెళ్లారు.
వారికి మంత్రి కేటీఆర్ దిశ నిర్ధేశం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రతి పక్షాల నోర్లు మూయించాలని అందుకోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి తెలిపారన్నారు.