స్థానిక అభ్యర్థి అయిన తనను మరోసారి ఆశీర్వదించి పార్లమెంట్కు పంపిస్తే స్థానిక సమస్యలపై వాణి వినిపిస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.. ఏ ఆపద వచ్చినా మీ ముందుకు వచ్చి తీరుతా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఒకరు గద్వాలకు పరిమితం అవుతారని, మరొకరు రాహుల్గాంధీ వెంట ఉంటారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని తీసుకొచ్చి పేదల ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.
అలాగే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించిందన్నారు. వారు చెప్పిన పథకాలు ఏవీ అమలు కావ డం లేదన్నారు. అధికార దాహం కోసమే లేనిపోని ఆశలు చూపుతున్నారని విమర్శించారు. ఓటేసే ముందు కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తుంచుకొని ఆలోచించి వేయాలని సూచించారు.