మహబూబ్నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నదని, రెం డు పార్టీల పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓ డించడమే ధ్యేయంగా రెండు పార్టీలు ఏకమయ్యాయ ని ఆరోపించారు. బుధవారం మహబూబ్నగర్ జి ల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడి యా సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మద్దతు తెలపండి.. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు మద్దతిస్తామని కమలం, హస్తం పార్టీలు లోపాయికారి ఒ ప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన జితేందర్రెడ్డి వ్యాఖ్యలే ఇందు కు నిదర్శనమని చెప్పారు. బీఆర్ఎస్ను అధికారంలో రాకుండా అడ్డుకునేందుకు ఇలాంటి అపవిత్ర పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. పైకి ఈ రెండు పార్టీలు వేర్వేరు అనేలా వ్యవహరిస్తున్నా నిజం మాత్రం ఇదేనన్నారు. తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలన్నింటినీ గుప్పించిందని, అధికారంలోకి వచ్చాక మాత్రం ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. రేవంత్ ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా పేరుతో రైతులకు ఎకరా కు రూ.15 వేలు ఇచ్చి ఉంటే కాంగ్రెస్కు ఓటేయండి.. లేదంటే బీఆర్ఎస్కు ఓటు వేయండి.. కల్యాణలక్ష్మి కిం ద రూ.లక్షతోపాటు తులం బంగారం అందించి ఉంటే రేవంత్రెడ్డి పార్టీకి ఓటేయండి.. ఇవ్వకుంటే కేసీఆర్ పా ర్టీని ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజ యం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పాలమూరు జిల్లాలో పర్యటించనున్న గులాబీ బా స్ కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. ప్రతి నియోజకవర్గం నుంచి 15 వేల మందిని సమీకరించనున్నట్లు తెలిపా రు. జడ్చర్ల నుంచి మొదలయ్యే ర్యాలీ అప్పన్నపల్లి, ఏ నుగొండ, శ్రీనివాసకాలనీ, పద్మావతి కాలనీ, బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్కు చేరుకుంటుందన్నారు. అక్కడ నిర్వహించే కార్నర్ మీటింగ్లో గులాబీ బాస్ ప్రసంగించిన అనంతరం రాత్రికి జిల్లా కేంద్రంలోనే బస చేస్తారన్నారు. అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణు లు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు పెరిగాయని, రైతులతోపాటు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అ వుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అ న్నారు. అధికారంలోకి వస్తామని ముందుగానే ఊహిం చి ఉంటే కాంగ్రెస్ హామీలు ఇచ్చేది కాదేమో అన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటిం చి ఇప్పటివరకు చేయలేదని ధ్వజమెత్తారు. తాజాగా మళ్లీ ఆగస్టు 15 తర్వాత అంటూ మాట మారుస్తున్నారని విమర్శించా రు. రేవంత్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. పింఛన్ రాకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడని, రైతుబంధు ఇ వ్వకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడని అన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌ డ్, ముడా మాజీ చై ర్మన్ వెంకన్న, పట్ట ణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక అభ్యర్థి అయిన తనను మరోసారి ఆశీర్వదించి పార్లమెంట్కు పంపిస్తే స్థానిక సమస్యలపై వాణి వినిపిస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.. ఏ ఆపద వచ్చినా మీ ముందుకు వచ్చి తీరుతా అన్నారు. కాం గ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఒకరు గ ద్వాలకు పరిమితం అవుతారని, మరొకరు రాహుల్గాంధీ వెంట ఉంటారని ఎద్దేవా చే శారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని తీసుకొచ్చి పేదల ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చే సిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించిందన్నారు. అధికార దాహం కోసమే లేనిపోని ఆశలు చూపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచి పనులను గుర్తుంచుకొని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.