Vagdevi Junior College | పాలమూరు, ఏప్రిల్ 24 : ఇంటర్ ఫలితాల్లో మహబూబ్నగర్ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు చరిత్ర సృష్టించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో మునావర్ ఫాతిమా 992/1000మార్కులు, ఎంపీసీ విభాగంలో సోనియా 990/ 1000 మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో సఫూరా 438/440 రాష్ట్రస్థాయి ప్రథమ మార్కులు, ఎంపీసీ విభాగంలో రేవంత్రెడ్డి 466 /470 మార్కులు, ముజామిల్ 466/470, ఇర్ఫాన్ 465/470, నవనీత్కుమార్గౌడ్ 465/470 మార్కులు సాధించారు.
వీరిని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్సుమన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఇదే ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుతూ జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో చాటాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి మాట్లాడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంటుందని జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారడానికి ఇటువంటి విజయాలు ఎంతో దోహదపడతాయని వివరించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ కార్యాలయ సూపరింటెండెంట్ సందీప్రెడ్డి, సిబ్బంది సాధిక్, అలీ, ప్రిన్సిపాల్ గీతాదేవి, ఐఐటీ, నీట్ అకాడమీ ఇన్చార్జ్జి పావనిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.