మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రం పరిధిలోని వేంనూరు గ్రామ శివారు రాము తండాలో ఆదివారం విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..తండాకు చెందిన బానోతు బాలు(30), భార్య స్వర్ణ కలిసి తమ పొలం వద్ద పనులు చేయడానికి వెళ్లారు.
ఈ క్రమంలో బాలుకు ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ తాకడంతో షాక్ తగిలి పడిపోయాడు. స్థానికులు గమనించి హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాలు మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
TTD | అలాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి : టీటీడీ
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు
Siddipet | నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ..గంటలోనే కేసును చేధించిన పోలీసులు