సిద్దిపేట : ఓ మహిళ తన 10 తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గంటలోనే వెతికి పట్టుకొని మహిళకు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట పట్టణానికి చెందిన బొలగం నవిత అనే మహిళ శనివారం రాత్రి షాపింగ్ చేయడానికి బయటకు వచ్చేటప్పుడు తన బ్యాగులో 10 తులాల బంగారు నెక్లెస్ పెట్టుకొని బయలుదేరింది.
షాపింగ్ అనంతరం ఇంటికి వెళ్లి చూసుకోగా బంగారం ఉన్న బ్యాగును మర్చిపోయిన విషయాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమందించింది. వెంటనే వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ పెట్రోల్ కార్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. సదరు మహిళ అక్షయ గ్రాండ్ దగ్గరలో ఉన్న జస్ట్ ఫర్ యు కిడ్స్ వేర్ షాప్లో షాపింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు షాప్లో ఉన్న సీసీ కెమెరాలు తనిఖీ చేశారు.
బంగారు నెక్లెస్ ఉన్న బ్యాగు బట్టల కింద ఉన్నట్లు గుర్తించి బంగారు నెక్లెస్ బ్యాగును నవితకు అప్పగించారు. సకాలంలో స్పందించి బాధితురాలికి బాసటగా నిలిచిన సిబ్బందిని సీపీ జోయల్ డెవిస్ అభినందించారు.
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు