ములుగు : జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు సంజయ్ భట్టాచార్య, ఆర్మ్ స్ట్రాంగ్ చాంగ్ సాన్, అబ్బగాని రాము, డాక్టర్ సురభి సింగ్ ఆదివారం సందర్శించారు.
వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఆలయ గైడ్ ద్వారా రామప్ప శిల్ప కళా సౌందర్యాన్ని తెలుసుకున్నారు. రామప్ప కట్టడం అద్భుతమని ప్రశంసించారు. అనంతరం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..