రాజాపేట, ఏప్రిల్ 2 : ఓవైపు అనారోగ్యం.. మరోవైపు వయస్సు మీదపడటంతో మరొకరికి భారం కావొద్దని భావించిన వృద్ధ దంపతులు తనువు చాలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన శీలం రంగారెడ్డి(72), ప్రమీల (62) దంపతులు. గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతోపాటు వయోభారంతో బాధపడుతున్నారు. కొడుకు, కూతుళ్ల పెండ్లిండ్లు కాగా.. కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు. తాము కొడుకుకు భారం కావొద్దనే ఆలోచనతో.. గురువారం రాత్రి ఇద్దరు ఇంట్లో పురుగుల మందు తాగారు. శుక్రవారం ఉదయం తలుపులు తీయకపోవడంతో పక్కింటి వారు కిటికీలో నుంచి చూసేసరికి ఇద్దరూ విగతజీవులుగా కన్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం