తొలి ప్రచారంలోనే జనాల్లేక వెనుదిరిగిన జానా
వెంట మిగిలింది ఇద్దరు నాయకులే
ఏం చేశారో రెండు నిమిషాలు కూడా చెప్పలేదు
పూల్యాతండాలో కాంగ్రెస్ అభ్యర్థికి చేదు అనుభవం
అదే తండా టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
పెద్దవూర, ఏప్రిల్ 2: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అట్టహాసంగా ప్రారంభించిన ప్రచార సభ తొలి రోజే జనాల్లేక వెలవెలబోయింది. నైరాశ్యంతో జానా వెనుదిరిగిపోయారు. పెద్దవూర మండలం పూల్యతండాలోని మఠం వద్ద శుక్రవారం ఐదు తండాలకు చెందిన వారితో నిర్వహించిన ప్రచార సభకు 60 మందికి మించి రాలేదు. ఇందులో మీడి యా, పోలీసు వాళ్లే సగానికిపైగా ఉన్నారు. తీవ్ర నిరాశకు గురైన జానారెడ్డి నిమిషం 32 సెకన్లు మాత్రమే మాట్లాడారు. గతంలో ఏం చేశారో చెప్పలేక కేవలం రెండు మాటలతోనే ప్రసంగం ముగించారు. ‘గతంలో 35 ఏండ్లు చేసిన అభివృద్ధి మీకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి ఆదరించాలి’ అని పేర్కొంటూ అసంతృప్తితో ప్రచారం ముగించుకొని వెళ్లారు. ఆ పార్టీ స్థానిక నాయకులు కూడా ఆయన వెంట లేరు. మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి శేఖర్రావు, మరొకరు మాత్రమే మిగిలారు.
టీఆర్ఎస్ శిబిరంలో ఇలా..
ఇదే సమయంలో అదే గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిర్వహించిన ప్రచారానికి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పూల్యాతండా పంచాయతీలోని 8తండాలకు చెంది న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన సుమారు 60 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు.
బండి సభ వెలవెల
పెద్దపల్లి జిల్లా మంథనిలోని బస్ డిపో సమీపంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ సమరభేరీ సభ వెలవెలబోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ హాజరైన ఈ సభకు జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
– మంథని టౌన్
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం