తిరుమల : వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం 31 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శణం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 74,128 మంది దర్శించుకోగా 36,053 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.58 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. సుమారు 3.96 లక్షల లడ్డూల విక్రయం జరిగిందన్నారు. 3.98 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించారని వెల్లడించారు.